CBN: డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2 విధానాలపై చంద్రబాబు సమీక్ష

పరి­శ్ర­మల అభి­వృ­ద్ధి­ని వే­గ­వం­తం చే­య­డంపై చర్చ

Update: 2026-04-13 11:45 GMT

, అను­మ­తుల ప్ర­క్రి­య­ను సు­ల­భ­త­రం చే­య­డం లక్ష్యం­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం మరో కీలక అడు­గు వే­సిం­ది. కేం­ద్రం ప్ర­తి­పా­దిం­చిన డీ-రె­గ్యు­లే­ష­న్ వి­ధా­నా­ల­పై రా­ష్ట్ర స్థా­యి­లో సమ­గ్ర సమీ­క్ష ని­ర్వ­హి­స్తూ, వ్యా­పా­రా­ల­కు అను­కూల వా­తా­వ­ర­ణా­న్ని మరింత బలో­పే­తం చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఈ ది­శ­గా ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కేం­ద్ర ఉక్కు మం­త్రి­త్వ­శాఖ కా­ర్య­ద­ర్శి సం­దీ­ప్ పౌం­డ్రి­క్ నే­తృ­త్వం­లో­ని ప్ర­తి­ని­ధి బృం­దం­తో సమా­వే­శ­మై పలు అం­శా­ల­పై చర్చిం­చా­రు. ఈ సమా­వే­శం­లో కేం­ద్రం ప్ర­తి­పా­దిం­చిన డీ-రె­గ్యు­లే­ష­న్ ఫేజ్-2 వి­ధా­నా­ల­పై సవి­వ­రం­గా చర్చ జరి­గిం­ది. పరి­శ్ర­మల ఏర్పా­టు­లో అన­వ­స­ర­మైన ఆల­స్యా­ల­ను తగ్గిం­చ­డం, అను­మ­తుల కోసం పె­ట్టే ని­బం­ధ­న­ల­ను సర­ళీ­క­రిం­చ­డం ప్ర­ధాన అం­శా­లు­గా ని­లి­చా­యి. ప్ర­స్తు­తం ఉన్న 800కు పైగా ని­బం­ధ­న­ల­ను 100 లో­పు­న­కు పరి­మి­తం చే­యా­ల­ని సీఎం సూ­చిం­చ­డం వి­శే­షం. అయి­తే ఈ ప్ర­క్రి­య­లో ప్ర­జల భద్రత, పర్యా­వ­రణ పరి­ర­క్షణ వి­ష­యం­లో ఎలాం­టి రాజీ ఉం­డ­కూ­డ­ద­ని స్ప­ష్టం చే­శా­రు.

అనుమతుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అధికారుల వేధింపులు లేకుండా పరిశ్రమలు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అటవీ చట్టాలను కూడా సరళీకరించి, పరిశ్రమల స్థాపనకు అడ్డంకులు తొలగించాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో జాతీయ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచించారు. డబుల్ లైసెన్సింగ్ వంటి పద్ధతులను పూర్తిగా నివారించాలన్నది సీఎం స్పష్టమైన అభిప్రాయంగా చెప్పారు. మే నెలాఖరులోగా డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రం అనుమతుల వ్యవస్థలో ముందంజలో ఉందని కేంద్ర ప్రతినిధి బృందం అభినందించగా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.

ఇదే సమయంలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై కూడా చర్చ జరిగింది. జూన్ నెల నుంచి ఈ దశపై పని ప్రారంభిస్తామని కేంద్ర బృందం వెల్లడించగా, ఆ దశలో టెక్నాలజీ వినియోగం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విధానాలకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టిస్తూ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. డీ-రెగ్యులేషన్ చర్యలు అమల్లోకి వస్తే వ్యాపారాలకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వనున్నాయి.

Tags:    

Similar News