CBN: సంక్షేమంలో అగ్రస్థానం మనదే: చంద్రబాబు

విజయనగరంలో ప్రజా వేదిక సభలో పాల్గొన్న సీఎం... పెన్షన్ల కోసమే రూ.48 వేల కోట్లు ఖర్చు చేశాం... సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్న ముఖ్యమంత్రి

Update: 2025-10-02 02:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం సం­క్షే­మం­లో టా­ప్‌­లో ని­లి­చిం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. వి­జ­య­న­గ­రం జి­ల్లా­లో­ని దత్తి­లో ని­ర్వ­హిం­చిన ప్ర­జా వే­దిక సభలో పా­ల్గొ­న్నా­రు.కే­వ­లం 16 నెలల కా­లం­లో పె­న్ష­న్ల­కు మా­త్ర­మే రూ.48 వేల కో­ట్లు ఖర్చు చే­శా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. వై­సీ­పీ హయాం­లో ఆనం­దం­గా పండగ చే­సు­కు­నే పరి­స్థి­తి ఉం­డే­ది కా­ద­న్నా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం­లో ఎవ­రి­కీ ఎలాం­టి ఇబ్బం­దు­లు లే­వ­ని అన్నా­రు. సూ­ప­ర్ సి­క్స్.. సూ­ప­ర్ హిట్ చేసి చూ­పిం­చా­మ­ని తె­లి­పా­రు. ఎం­త­మం­ది పి­ల్ల­లు ఉంటే అం­ద­రి­కీ తల్లి­కి వం­ద­నం ఇచ్చా­మ­ని గు­ర్తు చే­శా­రు. రై­తుల ఖా­తా­ల్లో అన్న­దాత సు­ఖీ­భవ ని­ధు­లు కూడా జమ చే­శా­మ­ని అన్నా­రు.

ఒకప్పుడు పండగ అంటేనే భయం

" ఒక్క­ప్పు­డు పండగ చే­సు­కో­వ­డం అంటే భయం.. ఇప్పు­డు ఆ ఇబ్బం­ది లేదు.. ఒకటో తా­రీ­ఖు­నే పె­న్ష­న్ వస్తోం­ది.. ఇది కూ­ట­మి ప్ర­భు­త్వం సత్తా.. మరే ఇతర రా­ష్ట్రా­ల్లో ఈ పరి­స్థి­తి లేదు" అని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. "ప్ర­పం­చం­లో ఎక్క­డా లేని వి­ధం­గా ఆర్థిక భరో­సా కల్పి­స్తు­న్నాం.. అర్హు­లైన ప్ర­తి ఒక్క­రి­కి పె­న్ష­న్లు అం­ది­స్తు­న్నాం అన్నా­రు.. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 63 లక్షల మం­ది­కి పె­న్ష­న్లు ఇస్తు­న్నాం.. గతం­లో ఒక నెల పె­న్ష­న్ తీ­సు­కో­క­పో­తే పె­న్ష­న్ కట్ అయి­పో­యే­ది… ఇప్పు­డు ఆ పరి­స్థి­తి లేదు.. ‌మూ­డు నె­ల­లు వరకూ చూ­స్తు­న్నాం.. మీరు మట్టి పను­ల­కు వె­ళ్లి­నా అక్క­డి­కే వచ్చి పె­న్ష­న్ ఇస్తు­న్నాం" అన్నా­రు. స్త్రీ శక్తి పథ­కం­లో భా­గం­గా రా­ష్ట్ర వ్యా­ప్తం­గా మహి­ళ­ల­కు ఆర్టీ­సీ­లో ఉచిత బస్సు ప్ర­యా­ణం కల్పిం­చా­మ­ని తె­లి­పా­రు. దీపం-2 పథ­కం­లో భా­గం­గా ఏడా­ది­కి ఉచి­తం­గా 3 గ్యా­స్ సి­లిం­డ­ర్లు ఇస్తు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు.

అక్టోబర్ 4న అటోడ్రైవర్లకు సేవలో..

అక్టో­బ­ర్ 4న ఆటో డ్రై­వ­ర్ల­కు సే­వ­లో పథకం ద్వా­రా రూ.15 వేలు ఇస్తా­మ­ని అన్నా­రు. మెగా డీ­ఎ­స్సీ ని­ర్వ­హిం­చిన 15 వేల మం­ది­కి ఉద్యో­గ­లు ఇచ్చా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. గతం­లో జగన్ పర్య­ట­న­ల­కు వస్తే చె­ట్లు నరి­కే­వా­ర­ని.. ప్ర­జ­లు జగన్ మీ­టిం­గ్‌ల నుం­చి వె­ళ్ల­కుం­డా గో­తు­లు తవ్వే­వా­ర­ని ఎద్దే­వా చే­శా­రు. ప్ర­జ­ల­కు నవ్వ­డా­ని­కి వీలు లే­కుం­డా జగన్ రా­ష్ట్రా­న్ని పా­లిం­చా­ర­ని కా­మెం­ట్ చే­శా­రు. 2024 ఎన్ని­క­ల్లో జగన్ ఓట­మి­తో ప్ర­జ­ల­కు మళ్లీ స్వా­తం­త్య్రం వచ్చిం­ద­ని అన్నా­రు. తాను జగ­న్‌­లా తు­గ్ల­న్‌­ని కాదు.. మంచి పాలన అం­దిం­చి రా­ష్ట్రా­న్ని అగ్ర పథాన ని­లు­పు­తా­న­ని అన్నా­రు. " ఆదాయాన్ని పెంచడం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు ఆదాయం పెరగాలి. ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. ఆహారపు అలవాటలు మారాలి. నేను వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెచ్చమని చెప్పాం.. కానీ, ఇప్పుడు ట్రూ ఆప్ ఛార్జీలను తగ్గించాం. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్లు పెట్టి రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. డ్వాక్రా రుణాలు తీసుకున్న ఆడ బిడ్డలు తిరిగి కడుతున్నారు. పెద్దవాళ్లు రుణాలు కట్టలేదు గానీ..  ఆడబిడ్డలు మాత్రం తిరిగి చెల్లిస్తున్నారు." అని సీఎం వెల్లడించారు.

Tags:    

Similar News