నారాయణస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Update: 2020-11-21 10:33 GMT

మహబూబ్‌నగర్‌ సీనియర్ నేత, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు దివంగత పి. నారాయణస్వామి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. అనంతరం చిన్నచింతకుంట(మం) అమ్మాపూర్‌లో.. నారాయణస్వామి విగ్రహాన్ని జూమ్ యాప్ ద్వారా ఆవిష్కరించారు. నారాయణ స్వామి అకాలమరణం చాలా బాధాకరమని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని.. ఆయన జీవితాంతం అసంఘటిత, గల్ఫ్ కార్మికుల కోసం నిరంతరంగా పనిచేశారని కొనియాడారు.

బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికుల కష్టాలను తీర్చడంలో నారాయణస్వామి ముందుండే వారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ తెలిపారు. విద్యార్థి దశ నుంచి పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని రమణ వెల్లడించారు. అమ్మాపూర్ లో నెలకొల్పిన నారాయణస్వామి విగ్రహాన్ని ఆయన స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేత నందమూరి సుహాసిని పాల్గొన్నారు.


Tags:    

Similar News