Chandrababu Naidu : జగనో ఫేక్ ముఖ్యమంత్రి ... ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు..!

Chandrababu Naidu : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.;

Update: 2021-11-11 14:45 GMT

Chandrababu Naidu : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నామినేషన్ల ఉపసంహరణలకు సంబంధించి ఫోర్జరీ సంతకాల బాగోతం న్యాయస్థానంలోనూ తేలిందని.. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తిరుపతి స్థానిక ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియలో ఫోర్జరీ సంతకాల వ్యవహారానికి సంబంధించిన పలు పత్రాలను మీడియా సమావేశంలో బయటపెట్టారు చంద్రబాబు. ఆర్వోలు బాధ్యత వహించి విధుల నుంచి వైదొలగాలన్నారు. ఫోర్జరీ సంతకానికి బాధ్యుడైన అధికారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు

జగనో ఫేక్ ముఖ్యమంత్రి అన్నారు చంద్రబాబు. ఫేక్‌ సంతకాలతో తన వారిని గెలిపించుకున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ అరాచక చర్యల వల్లే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యాయని విమర్శించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News