Chandrababu: కుప్పంలో చంద్రబాబు సొంతిల్లు.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పూర్తి..
Chandrababu: చంద్రబాబు.. సొంత నియోజకవర్గం కుప్పంకు అందుబాటులో ఉండడానికి సొంతిల్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలకు అందుబాటులో ఉండడానికి సొంతిల్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు తొలి అడుగు పడింది. ఇంటి నిర్మాణం కోసం ఎంపికచేసిన శాంతిపురం మండలం కడపల్లి వద్ద గల రెండెకరాల పది సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. గత కుప్పం పర్యటనలో చంద్రబాబు.. కడపల్లి వద్ద స్థలాన్ని పరిశీలించి రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఏజెంట్గా చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఆ పత్రాలను కుప్పం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు.