కరోనా విజృంభిస్తున్నా నిర్లక్ష్యం వీడని ప్రజలు..!
విశాఖలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కేసులు, మరణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. కోవిడ్ వైరస్ విజృంభిస్తుంటే.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు.
విశాఖలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కేసులు, మరణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. కోవిడ్ వైరస్ విజృంభిస్తుంటే.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. భయం లేకుండా నగరంలో ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఇక ఆదివారం కావడంతో ఫిష్ మార్కెట్కు ప్రజలు పోటెత్తారు. భౌతికదూరం, శానిటైజర్లు వంటి కరోనా నిబంధనలను పాటించకుండా చేపలు కొనేందుకు జనం ఎగబడుతున్నారు.