యోగాంధ్ర పేరుతో విశాఖలో ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ యోగా భారీ ఈవెంట్ కోసం గిరిజన ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను తీసుకొచ్చి సరైన వసతులు కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు కనీసం కప్పుకోవడానికి బెడ్ షీట్లు ఇవ్వలేదని, దోమలు కరుస్తున్నా.. వారిని నేలపైనే పడుకోబెట్టారని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.