కాకినాడ.. టైకి కెమికల్ ఇండస్ట్రీస్లో ఎయిర్ గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి
గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.;
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో ప్రమాదం చోటుచేసుకుంది. టైకి కెమికల్ ఇండస్ట్రీస్లో ఎయిర్ గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీకేజీతో బిల్డింగ్ చుట్టుపక్కన ఉన్న గోడ కూలి రోడ్డుపై చెల్లాచెదురైంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆరుగురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయినవారు సుబ్రమణ్యం, వెంకటరమణగా గుర్తించారు. గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.