బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయం నుండి మోస్తరు నుండి భారీ వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. మూడు రోజుల పాటు వర్షాలు కురవనుండటంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.