AP CM YS Jagan : జగన్‌ 11 కేసులపై హైకోర్టులో విచారణ ఎల్లుండికి వాయిదా..!

AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్‌ 11 కేసులపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. కేసుల్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టింది.

Update: 2021-06-23 10:30 GMT

AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్‌ 11 కేసులపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. కేసుల్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. కేసులు సుమోటోగా తీసుకోవడం న్యాయ విరుద్ధమని అన్నారు. న్యాయపరమైన చర్యల్ని పరిపాలన విధానాల ద్వారా తీసుకోవడం న్యాయవిరుద్ధమని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కేసుల్లో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కేసుకు విచారణ అర్హత ఉందో లేదో ముందే నిర్ధారించాలని ఏజీ వాదనలు వినిపించారు. ఏజీ వాదనలు విన్న హైకోర్టు... విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Tags:    

Similar News