Air Pollution in AP : ఏపీలో పెరిగిన వాయుకాలుష్యం

Update: 2025-01-25 06:00 GMT

APలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. రోజురోజుకు ప్రధాన పట్టణాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోంది. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ లెక్కల ప్రకారం గతేడాది సెప్టెంబరులో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో టాప్‌-10 విశాఖపట్నం, విజయవాడ నిలిచాయి. రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్టు జాతీయ కాలుష్యనియంత్రణ మండలి గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. 

Tags:    

Similar News