APలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. రోజురోజుకు ప్రధాన పట్టణాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ లెక్కల ప్రకారం గతేడాది సెప్టెంబరులో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో టాప్-10 విశాఖపట్నం, విజయవాడ నిలిచాయి. రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్టు జాతీయ కాలుష్యనియంత్రణ మండలి గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.