JAGAN: ఉద్రిక్తతలు, ఆందోళనల మధ్య జగన్ పర్యటన

జగన్ పర్యటన వేళ దళిత సంఘాల ధర్నా... తోపులాటలో వృద్ధురాలికి గాయాలు

Update: 2025-10-10 03:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని ప్ర­భు­త్వ వై­ద్య కళా­శా­లల ప్రై­వే­టీ­క­రణ ఓ కు­ట్ర అని మాజీ సీఎం, ఎమ్మె­ల్యే వై­ఎ­స్‌ జగ­న్‌­మో­హ­న్‌­రె­డ్డి వి­మ­ర్శిం­చా­రు. నర్సీ­ప­ట్నం మె­డి­క­ల్‌ కా­లే­జీ­ని సం­ద­ర్శిం­చిన ఆయన, ప్ర­భు­త్వం చే­ప­డు­తు­న్న ప్రై­వే­టీ­క­ర­ణ­ను “కు­ట్ర”గా వర్ణిం­చా­రు. పే­ద­ల­కు ఉప­యో­గ­ప­డే ప్ర­భు­త్వ మె­డి­క­ల్‌ కా­లే­జీ­ల­ను ప్రై­వే­ట్ పరం­గా మా­ర్చ­డం ద్వా­రా వా­రి­ని అన్యా­యా­ని­కి లో­ను­చే­స్తా­ర­ని జగ­న్‌ ఆరో­పిం­చా­రు. తమ పా­ల­న­లో ప్ర­తి జి­ల్లా­కు ప్ర­భు­త్వ మె­డి­క­ల్‌ కా­లే­జీ­లు ఏర్పా­టు చే­య­బ­డిన వి­ష­యా­న్ని గు­ర్తు­చే­శా­రు. ప్రై­వే­ట్ ఆస్ప­త్రు­లు ఎక్కువ ఛా­ర్జీ­లు వసూ­లు చే­య­డం వల్ల పే­ద­వా­రి­కి వై­ద్యం అం­దిం­చ­డం అసా­ధ్య­మ­వు­తుం­ద­ని, అం­దు­కే ప్ర­భు­త్వ వై­ద్య కళా­శా­ల­లు అం­దు­బా­టు­లో­కి తె­చ్చి­న­ట్ల­ని పే­ర్కొ­న్నా­రు. నర్సీ­ప­ట్నం­లో 52 ఎక­రా­ల్లో మె­డి­క­ల్‌ కా­లే­జీ ని­ర్మా­ణం చే­ప­ట్ట­డం, కో­వి­డ్ సం­క్షో­భం­లో రూ.500 కో­ట్లు ఖర్చు చేసి, ఈ మె­డి­క­ల్‌ కా­లే­జీ పూ­ర్త­యిన తర్వాత 600 బె­డ్ల­తో పే­ద­ల­కు ఉచిత వై­ద్యం అం­దిం­చ­ను­న్న­ట్టు జగ­న్‌ అన్నా­రు.

ఆంక్షలు ఉల్లంఘన

జగ­న్‌ పర్య­టన నే­ప­థ్యం­లో జా­తీయ రహ­దా­రి­పై జనం గు­మి­గూ­డొ­ద్ద­ని పో­లీ­సు­లు ఆం­క్ష­లు వి­ధిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. అయి­తే, రో­డ్డు మా­ర్గం­లో వె­ళ్తు­న్న జగ­న్‌­ను కలి­సేం­దు­కు ప్ర­జ­లు, వై­కా­పా కా­ర్య­క­ర్త­లు రో­డ్ల­పై­కి చే­రు­కుం­టు­న్నా­రు. పో­లీ­సు­లు వి­ధిం­చిన ఆం­క్ష­ల­ను జగ­న్‌ లె­క్క­చే­య­కుం­డా మా­ర్గ­మ­ధ్యం­లో అక్క­డ­క్క­డా ఆగు­తూ ప్ర­జల నుం­చి వి­న­తు­లు తీ­సు­కుం­టు­న్నా­రు. దీం­తో కి­లో­మీ­ట­ర్ల మేర ట్రా­ఫి­క్‌ ని­లి­చి­పో­యి వా­హ­న­దా­రు­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­రు. పలు చో­ట్ల అం­బు­లె­న్సు­లు సైతం వె­ళ్ల­లే­ని పరి­స్థి­తు­లు నె­ల­కొ­న్నా­యి.

దళిత సంఘాల ఆందోళన

జగన్ పర్య­టన వేళ దళిత సం­ఘా­లు ఆం­దో­ళ­న­కు ది­గా­యి. దళిత సం­ఘా­లు ఆం­దో­ళన చే­ప­ట్టా­యి. పట్ట­ణం­లో­ని కూ­డ­లి­లో దళిత నే­త­లు, ఆయా సం­ఘాల ప్ర­తి­ని­ధు­లు మా­న­వ­హా­రం­గా ఏర్ప­డి జగ­న్‌­కు వ్య­తి­రే­కం­గా ని­నా­దా­లు చే­శా­రు. వై­సీ­పీ హయాం­లో మత్తు వై­ద్యు­డు డా­క్ట­ర్‌ సు­ధా­క­ర్‌­కు జరి­గిన అవ­మా­నా­లు, వే­ధిం­పు­ల­ను ఈ సం­ద­ర్భం­గా ప్ర­స్తా­విం­చా­రు.  కరో­నా సమ­యం­లో డా­క్ట­ర్‌ సు­ధా­క­ర్‌ పీ­పీఈ కి­ట్‌ అడి­గి­నం­దు­కు ఆయ­న్ను మా­న­సి­కం­గా వే­ధిం­చా­ర­ని దళిత సం­ఘా­లు ఆరో­పిం­చా­యి. ‘ఒక దళిత మే­ధా­వి­కి జగ­న్‌­రె­డ్డి చే­సిన సన్మా­నం ఇది’, ‘జగ­న్‌­రె­డ్డి ప్ర­భు­త్వం­తో పో­రా­డి అల­సి­పో­యి ఆగిన దళిత గుం­డె’ అంటూ డా­క్ట­ర్‌ సు­ధా­క­ర్‌ ఫొ­టో­ల­తో ఉన్న ప్ల­కా­ర్డు­ల­ను దళిత నే­త­లు ప్ర­ద­ర్శిం­చా­రు. ‘జగ­న్‌ గో­బ్యా­క్‌’ అంటూ ని­న­దిం­చా­రు.

Tags:    

Similar News