JAGAN: రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం: జగన్

Update: 2025-09-20 07:00 GMT

ఏపీ­లో ప్ర­స్తు­తం అసెం­బ్లీ సమా­వే­శా­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. ఈ సమా­వే­శా­ల­కు ఎప్ప­ట్లా­గే వై­సీ­పీ అధి­నేత జగన్ సహా మి­గి­లిన ఎమ్మె­ల్యే­లు వె­ళ్ల­లే­దు. అయి­తే అసెం­బ్లీ­కి వె­ళ్ల­క­పో­వ­డం­పై తా­జా­గా జగ­న్‌ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. '' అసెం­బ్లీ­కి వె­ళ్లొ­ద్ద­ని నేను ఎవ­రి­కీ చె­ప్ప­లే­దు. ప్ర­తి­ప­క్ష హోదా ఇవ్వ­క­పో­యి­నా సమయం ఇస్తా­మ­ని క్లా­రి­టీ ఇవ్వొ­చ్చు. అసెం­బ్లీ­కి వె­ళ్ల­లే­ద­ని ఎమ్మె­ల్యే­ల­పై చర్య­లు తీ­సు­కుం­టే ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు రా­జీ­నా­మా చే­స్తాం. ఆ తర్వాత ఎన్ని­క­ల­కు వె­ళ్తా­మ­ని­'' జగన్ అన్నా­రు. జగన్ పా­ర్టీ శా­స­న­స­భా­ప­క్ష భే­టీ­లో అసెం­బ్లీ­కి వె­ళ్ల­క­పో­వ­డం­పై మా­ట్లా­డా­రు. అసెం­బ్లీ­కి రా­వా­లం­టే ఒక కం­డి­ష­న్ ఉం­ద­ని చె­ప్పా­రు. సభలో మా­ట్లా­డేం­దు­కు తగి­నంత టైమ్ ఇస్తే సభ­కొ­స్తా­న­ని తె­లి­పా­రు. ఎమ్మె­ల్యే­ల­కు ఇచ్చి­న­ట్లు కొ­న్ని ని­మి­షా­లు మా­త్ర­మే సమయం ఇస్తే నే­నేం మా­ట్లా­డా­లం­టూ ప్ర­శ్నిం­చా­రు.

మారని జగన్.. వైసీపీ నేతల్లో నైరాశ్యం

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తీరు మారడంలేదు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. ఆయన మాత్రం వరుసగా బెంగళూరు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. నేడు మరోసారి బెంగుళూరు వెళ్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోయినా.. కనీసం తాడేపల్లిలో ఉండి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తే బాగుండేదని సొంత నేతలే పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే, సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకు వస్తానని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ తెలిపారు. ఎమ్మెల్యేలతో సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని నిమిషాల సమయంతో ప్రజా సమస్యలను వివరించడం సాధ్యం కాదన్నారు. సభలో సమయం కరువవుతుందని, అందుకే ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా నిరాకరణపై కోర్టులో కేసు వేసినట్టు ఆయన గుర్తుచేశారు.

Tags:    

Similar News