మైదుకూరులో కీలకంగా మారిన జనసేన అభ్యర్ధి..!

మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి హోరా హోరీగా వార్డులు గెలుచుకోవడంతో అభ్యర్ధులను ఆకర్షించడంపై నేతలు దృష్టి పెట్టారు.

Update: 2021-03-14 10:30 GMT

కడప జిల్లా మైదుకూరులో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి హోరా హోరీగా వార్డులు గెలుచుకోవడంతో అభ్యర్ధులను ఆకర్షించడంపై నేతలు దృష్టి పెట్టారు. మొత్తం 24 వార్డులకు గాను టీడీపీ 12 వార్డులు గెలుచుకోగా.. వైసీపీ 11 వార్డులు దక్కించుకుంది. ఒక చోట జనసేన విజయం సాధించింది. దీంతో మైదుకూరులో జనసేన అభ్యర్ధి పాత్ర ఎంతో కీలకంగా మారింది. అతన్ని తమవైపు తిప్పుకునేందుకు పార్టీల నేతలు శాయశక్తులా ప్రయత్నాలు ప్రారంభించారు.

Tags:    

Similar News