pawan kalyan : ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్

pawan kalyan : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2022-04-23 02:30 GMT

pawan kalyan : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పవన్‌కల్యాణ్ కలువనున్నారు.

గన్నవరం నుంచి రోడ్డుమార్గాన ఏలూరు మీదుగా చింతలపూడి చేరుకోనున్న జనసేన అధినేత...ధర్మాజీగూడెం, పెదవేగి, లింగపాలెంలోని బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లనున్నారు. అనంతరం చింతలపూడిలో నిర్వహించనున్న రచ్చబండలో పాల్గొననున్నారు.

ఇటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 41మంది కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు జనసేనాని

Tags:    

Similar News