మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ జవహర్‌

Update: 2020-09-21 09:33 GMT

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్‌ మండిపడ్డారు. తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వడం అనేది తరతరాల నుంచీ ఉన్న నిబంధన అన్నారు.. ఆ విషయం టీటీడీ చైర్మన్‌కు తెలియక పోవడం శోచనీయమన్నారు. సీఎం జగన్‌ సైతం ముందునుంచి తనకు నచ్చని అంశాలపై ద్వేషభావంతోనే ఉన్నారన్నారు. కొడాలినాని వ్యాఖ్యలపై స్పందించకుండా సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని జవహర్‌ ప్రశ్నించారు.

Tags:    

Similar News