ఏపీలో నియంత పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. త్వరలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన వస్తుంది అన్నారు.. తమ కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. తమకు జీవనాధారమైన మైన్స్ను మూసివేసి.. ఆకలితో చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. మైన్స్కు అనుమతి ఇవ్వకుండా AD దొంగ క్యాంపులకు వెళ్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం తాడిపత్రి మైన్స్ ఆఫీసు ఎదుట భార్యతో సహా బైఠాయిస్తానని హెచ్చరించారు.