Kakani Govardhan Arrested : కేరళలో కాకాణి అరెస్ట్.. ఏపీకి తరలింపు

Update: 2025-05-26 05:45 GMT

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన్ని రాష్ట్ర పోలీసులు కేరళలో అదుపు లోకి తీసుకున్నారు. అక్కడి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన మీదట రాష్ట్రానికి తరలిస్తు న్నారు. సోమవారం నెల్లూరుకు తీసుకురా నున్నారు. క్వార్ట్జ్ మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన్ను ప్రశ్నించిన మీదట కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

అక్రమ మైనింగ్ కేసులో నాలుగో నిందితుడుగా ఉన్న కాకిణి గోవర్దన్ రెడ్డిని విచారించేందుకు గతంలో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గత కొంత కాలంగా గాలిస్తున్నాయి. ఎట్టకేలకు కాకాణి కేరళలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. హైదరాబాద్, బెంగళూరులో గత కొంతకాలంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు కాకాణి బంధువుల ఇళ్ళు, ఫామ్ హౌస్లలో గాలించారు. సన్నిహితులు, బంధువులు అందరి ఇళ్ళను పోలీసులు జల్లెడ పట్టారు. ఎట్టకేలకు ఆయనను కేరళలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Tags:    

Similar News