వైసీపీ ప్రభుత్వం హిందూ సంస్థలను అణచివేస్తోంది : కమలానంద భారతి
ఏపీ ప్రభుత్వం హిందూ సంస్థలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం..
ఏపీ ప్రభుత్వం హిందూ సంస్థలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి ఆరోపించారు. సింహాచలం దేవాలయంలో మూడు నెలలుగా అనధికారికంగా ఓ వ్యక్తి వున్నాడంటే అర్థమేంటని ప్రశ్నించారు.. రాష్ట్ర ప్రభుత్వం సింహాచల ఆలయాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు.. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కమలానంద భారతి డిమాండ్ చేశారు.. హిందూ సమాజానికి ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోందన్నారు.