kavitha: బీజేపీ ఎంపీలూ.. రాజీనామా చేయండి

జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్.. రాజీనామా చేస్తేనే బీసీ బిల్లుకు మోక్షం.. అర్వింద్ ఆరోపణలపై కవిత ఆగ్రహం

Update: 2025-10-26 13:10 GMT

గో­దా­వ­రి పరి­వా­హక ప్రాం­తం­లో ముం­పు­న­కు గు­రైన రై­తు­ల­కు ఎక­రా­ని­కి రూ. 50 వేల పరి­హా­రం ఇవ్వా­ల­ని తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కవిత డి­మాం­డ్ చే­శా­రు. అప్ప­టి మం­త్రి ప్ర­శాం­త్ రె­డ్డి, ప్ర­స్తుత మం­త్రి తు­మ్మల వల్లే ముం­పు ము­ప్పు ఉం­ద­ని తె­లి­పా­రు. మొ­క్క రై­తు­ల­కు బో­న­స్ చె­ల్లిం­చి, కొ­ను­గో­లు కేం­ద్రా­లు తక్ష­ణం ఏర్పా­టు చే­యా­ల­న్నా­రు. ధా­న్యం తడి­సిం­ది, తడి­సిన ధా­న్యం కడ్తా లే­కుం­డా కొ­ను­గో­లు చే­యా­ల­న్నా­రు. బీ­జే­పీ ఎంపీ ఉన్నా.. లే­న­ట్టే అని వి­మ­ర్శిం­చా­రు. మా­ధ­వ­న­గ­ర్ బ్రి­డ్జి పను­లు ఇంకా ఎం­దు­కు పూ­ర్తి కా­లే­దు ఎంపీ అర­విం­ద్ చె­ప్పా­ల­న్నా­రు. ఎంపీ అర­విం­ద్ రా­జీ­నా­మా చే­స్తే బీసీ బి­ల్లు నడు­చు­కుం­టూ వస్తుం­ద­న్నా­రు. బీ­జే­పీ ఎం­పీ­లు రా­జీ­నా­మా చే­స్తే­నే బీసీ బి­ల్లు­కు మో­క్షం లభి­స్తుం­ది.. బీ­జే­పీ ఎంపీ తన కు­టుం­బం ఎంపీ లేని పోనీ ఆరో­ప­ణ­లు చే­స్తు­న్నా­రు. ఆయన చి­ట్టా బయట పె­డ­తా అని పే­ర్కొ­న్నా­రు. ఎంపీ అర్విం­ద్ రా­జీ­నా­మా చే­స్తే బీసీ బి­ల్లు అదే వస్తుం­ద­ని చె­ప్పు­కొ­చ్చా­రు. అతని చి­ట్టా త్వ­ర­లో­నే బయట పె­డ­తా­న­ని హె­చ్చ­రిం­చా­రు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం వి­ద్య­ను అణచి వే­స్తోం­ద­ని ఫైర్ అయ్యా­రు. ఫీజు రీ­యిం­బ­ర్స్‌­మెం­ట్ వెం­ట­నే ఇవ్వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. సా­మా­జిక తె­లం­గాణ కోసం జనం­బాట పట్టా­న­ని ఉద్ఘా­టిం­చా­రు. ప్ర­తీ జి­ల్లా­లో చాలా కా­ర్య­క్ర­మా­లు చే­ప­డ­తా­న­ని వి­వ­రిం­చా­రు. ము­ని­గి­పో­యే పడవ కాం­గ్రె­స్‌­తో తన­కేం ఏం సం­బం­ధ­మ­ని కవిత ప్ర­శ్నిం­చా­రు.

ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకోలేదు

జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­పై ఇంకా ఎలాం­టి స్టాం­డ్‌ తీ­సు­కో­లే­ద­ని కవిత అన్నా­రు. అం­ద­రి తె­లం­గాణ కా­వా­ల­ని.. కొం­ద­రి తె­లం­గాణ మా­త్ర­మే కా­వొ­ద్దు అనే­ది తన లక్ష్యం అని పే­ర్కొ­న్నా­రు.బీ­ఆ­ర్‌­ఎ­స్‌ 10 మంది ఎమ్మె­ల్యే­లు ఎం­దు­కు పా­ర్టీ మా­రా­రో తనకు తె­లి­య­ద­న్నా­రు. పా­ర్టీ ఏక­ప­క్ష ని­ర్ణ­యం తీ­సు­కొ­ని తనను బయ­ట­కు పం­పిం­దా­న్ని ఆవే­దన వ్య­క్తం చే­సా­రు. ఎమ్మె­ల్సీ పద­వి­కి, పా­ర్టీ ప్రా­థ­మిక సభ్య­త్వా­ని­కి తాను రా­జీ­నా­మా చే­శా­న­ని, ఆ రా­జీ­నా­మా­కు కట్టు­బ­డి ఉన్నా­న­ని కవిత స్ప­ష్టం చే­సా­రు. అన్న­దా­త­ల­కి ఎక­రా­ని­కి రే­వం­త్‌­రె­డ్డి ప్ర­భు­త్వం రూ. 50 వేలు ఇవ్వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. 70 వేల ఎక­రా­ల్లో మొ­క్క­జొ­న్న రై­తు­లు దగా పడ్డా­ర­ని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. 80 శాతం మంది రై­తు­లు ధా­న్యా­న్ని తక్కువ ధరకు అమ్ము­కు­న్నాక కొ­ను­గో­లు కేం­ద్రా­లు ఎం­దు­కు పె­డు­తు­న్నా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. ఈ వి­ష­యం­లో రే­వం­త్‌­రె­డ్డి సర్కా­ర్ మరో­సా­రి ఆలో­చిం­చా­ల­ని సూ­చిం­చా­రు. ధా­న్యం కొ­ను­గో­లు­లో అన్న­దా­త­లు క్విం­టా­కు రూ.700 నష్ట­పో­యా­ర­ని వా­పో­యా­రు.

Tags:    

Similar News