కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆళ్లగడ్డ యువకుడు మొగల్ గఫార్ హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గఫార్కు ఇటీవల ఆళ్లగడ్డకు చెందిన యువతితో నిశ్చితార్ధం అయినట్లు గుర్తించారు. త్వరలోనే పెళ్లి జరగాల్సి ఉండగా దారుణహత్యకు గురయ్యాడు గఫార్. యువతి ప్రియుడు శేఖర్ ఈ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య అనంతరం ఆ యువతికి శేఖర్ ఫోన్ చేసినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా గుర్తించినట్లు చెప్పారు. గఫార్ స్వస్థలం ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు.