శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. మెలియాపుట్టిలోని ఫ్లైఓవర్ వద్ద 18 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎర్ర రాజేష్, రుంకు నవీన్.. టెక్కలి వాసులుగా గుర్తించారు. ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అడవి పందులను వేటాడేందుకు ఈ బాంబులను వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో టెక్కలిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.