LOKESH: అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ.. పంట నష్టంపై నివేదిక

‘మొంథా’ నష్టం రూ.6,352 కోట్లు

Update: 2025-12-02 10:30 GMT

ఏపీ­లో మొం­థా తు­పా­ను కా­ర­ణం­గా రూ.6,352 కో­ట్ల మేర నష్టం వా­టి­ల్లిం­ద­ని మం­త్రు­లు లో­కే­శ్‌, అనిత.. కేం­ద్ర హోం మం­త్రి అమి­త్‌ షాను కలి­సి ని­వే­దిక అం­ద­జే­శా­రు. పా­ర్ల­మెం­ట్‌ హా­ల్‌­లో­ని అమి­త్‌ షా ఛాం­బ­ర్‌­లో జరి­గిన సమా­వే­శం­లో లో­కే­శ్‌, అని­త­తో­పా­టు టీ­డీ­పీ ఎం­పీ­లు పా­ల్గొ­న్నా­రు. మొం­థా తు­పా­ను వల్ల ఏపీ ప్ర­జ­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు పడ్డా­ర­ని, మౌ­లిక సదు­పా­యా­లు తీ­వ్రం­గా దె­బ్బ­తి­న్నా­య­ని చె­ప్పా­రు. మొ­త్తం 3,109 గ్రా­మా­లు తు­పా­ను వల్ల ప్ర­భా­వి­త­మ­య్యా­య­ని పే­ర్కొ­న్నా­రు. ప్ర­తి ప్ర­భా­విత కు­టుం­బా­ని­కి తక్షణ సా­యం­గా ఏపీ ప్ర­భు­త్వం తర­ఫున రూ.3 వేలు అం­దిం­చా­మ­ని చె­ప్పా­రు.

తుఫానుతో భారీ నష్టం

వ్య­వ­సాయ అను­బంధ రం­గా­ల­కు రూ.271 కో­ట్లు, రో­డ్లు, మౌ­లిక సదు­పా­యా­ల­కు రూ.4,324 కో­ట్లు, వి­ద్యు­త్‌ రం­గా­ని­కి రూ.41 కో­ట్లు, నీటి వన­రు­లు ప్రా­జె­క్టు­ల­కు రూ.369 కో­ట్లు, శా­శ్వత ని­ర్మా­ణా­ల­కు రూ.1302 కో­ట్ల మేర నష్టం వా­టి­ల్లిం­ద­ని వి­వ­రిం­చా­రు. మొ­త్తం రూ.6,352 కో­ట్ల నష్టం­లో ఎన్డీ­ఆ­ర్‌­ఎ­ఫ్‌ మా­ర్గ­ద­ర్శ­కాల ప్ర­కా­రం తక్షణ ఉప­శ­మ­నం, తా­త్కా­లిక పు­న­రు­ద్ధ­రణ కోసం రూ.902 కో­ట్లు అవ­స­ర­మ­న్నా­రు. తు­పా­ను నష్టం­పై కేం­ద్ర బృం­దం క్షే­త్ర­స్థా­యి పరి­శీ­లన కూడా జరి­పిం­ద­ని అమి­త్‌ షాకు లో­కే­శ్‌ తె­లి­పా­రు.

కేంద్ర వ్యవసాయమంత్రితో నారా లోకేష్ భేటీ


మొం­థా తు­పా­ను ప్ర­భా­వం­తో ఉధృ­తం­గా వీ­చిన గా­లు­లు, భారీ వర్ష­పా­తం, వర­ద­లు అనేక గ్రా­మా­లు, వ్య­వ­సాయ భూ­ము­ల­ను తీ­వ్రం­గా ప్ర­భా­వి­తం చే­శా­య­ని మం­త్రి నారా లో­కే­శ్ తె­లి­పా­రు. కేం­ద్ర వ్య­వ­సాయ శాఖ మం­త్రి శి­వ­రా­జ్ సిం­గ్ చౌ­హా­న్ తో మం­త్రి లో­కే­ష్... హోం మం­త్రి అని­త­తో కలి­సి భేటీ అయ్యా­రు. ఈ సం­ద­ర్భం­గా మొం­థా తు­పా­ను నష్టా­న్ని వి­వ­రి­స్తూ... ఈ తు­ఫా­ను మొ­త్తం 24 జి­ల్లా­ల్లో­ని 443 మం­డ­లాల పరి­ధి­లో 3,109 గ్రా­మా­ల­ను ప్ర­భా­వి­తం చే­సిం­ది­ని కేం­ద్ర మం­త్రి దృ­ష్టి­కి తీ­సు­కె­ళ్లా­రు. సు­మా­రు 9.53 లక్షల మంది ప్ర­జ­లు నష్టా­న్ని చవి­చూ­శా­ర­ని. పంట ము­ని­గి­పో­వ­డం వల్ల వ్య­వ­సాయ జీ­వ­నో­పా­ధి, మౌ­లిక సదు­పా­యా­లు, పౌర సేవా రం­గా­ల­కు భా­రీ­న­ష్టం సం­భ­విం­చిం­ద­ని వి­వ­రిం­చా­రు. ఈ చర్య­లు మానవ నష్టా­ల­ను తగ్గిం­చ­డం­తో­పా­టు బా­ధి­తు­ల­కు ని­రం­తర సహా­యా­న్ని అం­దిం­చ­డం­లో ఇబ్బం­దు­లు లే­కుం­డా చే­శా­య­ని మం­త్రి లో­కే­ష్... కేం­ద్ర మం­త్రి­కి వి­వ­రిం­చి ఆదు­కో­వా­ల­ని కో­రా­రు.

Tags:    

Similar News