Lokesh : అన్ని సార్లు వాళ్ళని మార్చడం ఎందుకు? మిమ్మల్నే మారిస్తే సరిపోతుంది కదా ! : నారా లోకేష్
Lokesh : మంత్రులను మారుస్తానంటూ నిన్న జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ చేసిన హెచ్చరికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు
Lokesh : మంత్రులను మారుస్తానంటూ నిన్న జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ చేసిన హెచ్చరికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. అన్నిసార్లు మంత్రులను మార్చడం ఎందుకు? మిమ్మల్నే మారిస్తే సరిపోతుంది కదా అంటూ ట్వీట్ చేశారు.
కేబినెట్ భేటీలో మంత్రులపై జగన్ కస్సుబుస్సులాడారు. విపక్షం తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోరా అంటూ మంత్రులపై మండిపడ్డారు. మీకు పదవులు ఇచ్చింది ఇందుకేనా? ఇలాగైతే మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్లకు అవకాశమిస్తా.. మంత్రిపదవులు ఇచ్చింది తానేనని గుర్తించుకోండి అంటూ మంత్రులపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. వారికి గట్టిగా క్లాస్ తీసుకున్నారు.
దీనిపై నారా లోకేష్ తాజాగా స్పందించారు. ప్రతిసారి మంత్రులను మార్చడం ఎందుకు? జగన్ను మార్చడానికే ప్రజలు ఫిక్సయినట్లు పేర్కొన్నారు. ఒక్కసారి ఛాన్స్ అంటూ గద్దెనెక్కి జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. ఏపీ ప్రజలు కూడా ఒక్కసారే ఛాన్స్ ఇచ్చారని, ఇక ఇవ్వరని అన్నారు.
మరోసారి మంత్రులని మారుస్తా - జగన్ రెడ్డి
— Lokesh Nara (@naralokesh) September 8, 2022
అన్ని సార్లు వాళ్ళని మార్చడం ఎందుకు? మిమ్మల్నే మారిస్తే సరిపోతుంది కదా!