LOKESH: "బాధితులందరినీ ఏపీకి తీసుకొస్తాం"

నేపాల్లో చిక్కుకున్న వారికి నారా లోకేశ్ భరోసా

Update: 2025-09-11 04:30 GMT

కేం­ద్ర ప్ర­భు­త్వం సహ­కా­రం­తో నే­పా­ల్‌­లో చి­క్కు­కు­న్న బా­ధి­తు­ల­ను సు­ర­క్షి­తం­గా ఏపీ­కి తీ­సు­కొ­చ్చేం­దు­కు మం­త్రి నారా లో­కే­శ్‌ చర్య­లు చే­ప­ట్టా­రు. సచి­వా­ల­యం­లో­ని ఆర్టీ­జీ­ఎ­స్‌­లో అధి­కా­రు­ల­తో మం­త్రి సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. నే­పా­ల్‌­లో చి­క్కు­కు­న్న తె­లు­గు ప్ర­జల సమా­చా­రా­న్ని అధి­కా­రు­లు లో­కే­శ్‌­కు వి­వ­రిం­చా­రు. మం­త్రి నే­పా­ల్‌­లో చి­క్కు­కు­న్న పలు­వు­రు తె­లు­గు­వా­రి­తో వీ­డి­యో కా­ల్‌­లో మా­ట్లా­డా­రు. మహి­ళ­లు సూ­ర్య­ప్రభ, రో­జా­రా­ణి అక్క­డి పరి­స్థి­తు­ల­ను మం­త్రి­కి వి­వ­రిం­చా­రు.

నే­పా­ల్ లో ఇప్ప­టి­వ­ర­కు అం­దిన అధి­కా­రిక సమా­చా­రం ప్ర­కా­రం 215 మంది తె­లు­గు­వా­రు చి­క్కు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. వీ­రం­తా నే­పా­ల్ లోని నా­లు­గు ప్రాం­తా­ల్లో ఉన్నా­రు. బఫా­ల్ లో చి­క్కు­కు­న్న 27 మంది శ్రీ­ధ­రా­చా­ర్యుల పర్య­వే­క్ష­ణ­లో ఉన్నా­రు. సి­మి­ల్ కోట్ లో కారి అప్పా­రా­వు వద్ద 12 మంది, పశు­ప­తి నగ­రం­లో­ని మహ­దే­వ్ హో­ట­ల్ వద్ద విజయ పర్య­వే­క్ష­ణ­లో 55 మంది, గౌ­శా­ల­లో­ని పిం­గ­ల­స్థా­న్ లో 90 మంది తె­లు­గు­వా­రు చి­క్కు­కు­న్న­ట్లు ప్రా­థ­మిక సమా­చా­రా­న్ని బట్టి తె­లు­స్తోం­ది. వీ­రం­ద­రి­నీ ఢి­ల్లీ­లో ప్ర­త్యేక ఫోన్ నెం­బ­ర్ల­తో కం­ట్రో­ల్ రూం ఏర్పా­టు చే­శా­రు.

Tags:    

Similar News