అమరావతి రైతుల ఆందోళన ఉధృతంగా సాగుతోంది. జగన్ కాన్వాయ్ వెళ్తుండగా.. రైతులు నినాదాలు చేశారు. సచివాలయం నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు జగన్ వెళ్లారు. ఈ సమయంలో దారి పొడవునా జై అమరావతి నినాదాలతో రైతులు హోరెత్తించారు. కాన్వాయ్ వైపు రైతులు దూసుకురాకుండా... రైతులకు అడ్డుగా పోలీసులు నిలబడ్డారు. జగన్ కాన్వాయ్ మందడం దీక్షా శిబిరం దాటేవరకు నినాదాలు హోరెత్తాయి.