TG : పంద్రాగస్టుకు ముందే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశం

Update: 2024-08-05 10:00 GMT

తమిళనాడు రాజధాని చెన్నై నగర దాహార్తిని తీర్చేందుకు ఈనెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఆన్ లైన్ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందజేసిన కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఈ కీలక సమావేశంలో ఖచ్చితంగా పాల్గొనాలని కోరారు. మరోవైపు గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం కూడా ఈ నెల 13న జరగనుంది.

సీతారామ ఎత్తిపోతల పథకం, సీతారా బహుళార్థసాధక ప్రాజెక్టు పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జీఆర్ఎంబీ భేటీకి హాజరు కావాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు జీ ఆర్ ఎంబీ సమాచారం పంపింది. ఈనెల 6న జరగాల్సిన ఈ సమావేశాన్ని తెలంగాణ అభ్యర్థన మేరకు గోదా బోర్డు ఈనెల 13కు వాయిదా వేసింది.

మరోవైపు గోదావరి- కావేరీ నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత అభ్యంతరాలపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఎర్రమంజిల్ లోని జలసౌధలో అథారిటీ చైర్మన్ భూపాల్సింగ్ నేతృత్వంలో సమావేశం కొనసాగనుంది.

Tags:    

Similar News