ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదు : ఎంపీ రఘురామ

Raghurama krishna raju : ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Update: 2021-10-06 10:30 GMT

Raghurama krishna raju : ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. నరేగా నిధులపై హైకోర్టు తీర్పు హర్షనీయమన్న ఆయన.. అందరికీ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఏపీలో టెండర్లకు ప్రభుత్వం పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ టెండర్లు వేసినా.. తెలుగువారుంటారన్నారు. కానీ ఏపీలో టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇక రంజాన్ పండుగకు తోఫాలు, క్రిస్టమస్‌కు కానుకలు ఇస్తారని.. మరీ హిందువుల పండుగలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News