దుర్గగుడి సభ్యురాలి కొడుక్కి ఓ న్యాయం.. దళిత యువకుడికి ఓ న్యాయమా..: లోకేశ్
విచారణ అని పిలిచి విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు అజయ్ను కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండ పరాకాష్టకు చేరిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విచారణ అని పిలిచి విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు అజయ్ను కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతిచెందాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడతాయనే భయంతో కుంటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారని ఆరోపించారు. దుర్గగుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, దళిత యువకుడికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి కొట్టి చంపారని గుర్తు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డొచ్చాడని వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారని.. ఇప్పుడు విచారణ పేరుతో అజయ్ని బలి తీసుకున్నారని లోకేష్ మండిపడ్డారు.