టీడీపీ ప్రచార జోరుకు తట్టుకోలేక జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారు: లోకేష్

టీడీపీ ప్రచార జోరుకు తట్టుకోలేక సీఎం జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

Update: 2021-04-08 16:15 GMT

టీడీపీ ప్రచార జోరుకు తట్టుకోలేక సీఎం జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న లోకేష్.. వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీ నుండి లోక్‌సభలో 22 కోతులు, రాజ్యసభలో 6 కోతులున్నాయని.. వీళ్లకు పార్లమెంట్‌లో నోరువిప్పి మాట్లాడే దమ్ము లేదన్నారు. ఏపీలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదని.. JCB ప్రభుత్వం అన్నారు. జేసీబీ అంటే జగన్‌ సర్వీస్‌ బాదుడని లోకేష్‌ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News