వైసీపీ మైనింగ్ మాఫియాపై ట్వీట్ చేసిన నారా లోకేష్
వైసీపీ మైనింగ్ మాఫియాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ట్వీట్ చేశారు.
వైసీపీ మైనింగ్ మాఫియాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి అన్నారు నారాలోకేష్. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోందని ఆరోపించారు. గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన.. జగన్రెడ్డి పాపాలు పండే రోజు దగ్గర్లో ఉందని మండిపడ్డారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో.. జగన్ రెడ్డి బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు.