NARAYANA: అమరావతి సేఫ్ సిటీ.. అనుమానమే లేదు
గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరు... జోరుగా నిర్మాణ పనులు: నారాయణ... నిర్మాణ పనుల్లో 13000 మంది కార్మికులు... అధికారుల క్వార్టర్లను పరిశీలించిన మంత్రి
అమరావతి చాలా సేఫ్ సిటీ… ఇందులో అనుమానం లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. అమరావతి – నేలపాడులోని గెజిటెడ్ అధికారుల భవనాలు పరిశీలించారు.. క్లాస్- 4 ఉద్యోగుల క్వార్టర్లు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 13 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు.. అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోంది.. 720 ప్లాట్లు గ్రూప్ 1 అధికారుల కోసం రెడీ అవుతున్నాయి. నవంబర్ చివరి వరకు నిర్మణాలు పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. నారాయణ మాట్లాడుతూ, "అమరావతి గ్రాఫిక్స్ల కోసం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం నిర్మించుకుంటున్నాం. అమరావతి అంటే ప్రజలకు అభిమానం ఉంది. గ్రాఫిక్స్ చూపిస్తూ మభ్యపెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు. అమరావతి చాలా సేఫ్ సిటీ. ఎలాంటి అనుమానం లేదు" అని అన్నారు. ప్రస్తుతం అమరావతిలో సుమారు 13,000 మంది కార్మికులు వివిధ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. అధికారులు నివసించేందుకు కావలసిన ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని చెప్పారు.
వేగంగా జరుగుతున్న పనులు
వచ్చే నెలలో గ్రూప్-డి ఉద్యోగుల కోసం జరుగుతున్న నిర్మాణాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. “అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాతే అధికారులకు గృహాలు కేటాయిస్తాం. అప్పటివరకు సహనంగా ఉండాలి” అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇప్పటికే ఉంది.. వచ్చే నెల 2 గ్రూప్ డీలో ఉన్న నిర్మణాలు పూర్తి అవుతాయి అన్నారు. అన్ని నిర్మాణాలు పూర్తి అయిన తర్వాతే అధికారులకు భవనాలు అందచేస్తామన్నారు. మరోవైపు, రాజధానిపై పని గట్టుకుని అబద్ధాలు చెబుతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు.. అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరు అని హెచ్చరించారు.. అమరావతి చాలా సేఫ్ సిటీ.. ఇందులో అనుమానం లేదని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. కాగా, కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్మాణలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం విదితమే.. సీఆర్డీఏలో నిర్ణయం తీసుకోవడం.. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం తెలపడం.. వెంటనే.. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతూ ముందుకు సాగుతున్నారు. అమరావతిపైనే ప్రత్యేక దష్టి సారించారు.