AP Corona Cases: కొత్తగా 1,115 కరోనా కేసులు.. 19 మరణాలు

Corona Cases: ఆంధ్రప్రదేశ్‎లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Update: 2021-08-31 12:26 GMT

Corona Cases: ఆంధ్రప్రదేశ్‎లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 52,319 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,66,29,314 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 13,857కి పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. మరోవైపు 1,265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,693 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లా్ల్లో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 


Tags:    

Similar News