PAWAN: మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ధీమా... \రూ.5 వేల కోట్ల హైవేలకు శంకుస్థాపన... భారత ఐక్యతకు పునాదన్న పవన్;

Update: 2025-08-03 06:00 GMT

ఏపీ­లో సు­స్థి­ర­మైన అభి­వృ­ద్ధి కోసం.. 15 ఏళ్లు కూ­ట­మి ప్ర­భు­త్వ­మే అధి­కా­రం­లో ఉం­డా­లి అని డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్ అన్నా­రు. కేం­ద్ర రవా­ణా, రహ­దా­రుల శాఖ మం­త్రి ని­తి­న్ గడ్క­రీ ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో రెం­డు కీలక జా­తీయ రహ­దా­రు­ల­ను జా­తి­కి అం­కి­తం చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా.. పవన్ కళ్యా­ణ్ ప్ర­సం­గి­స్తూ.. కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఏజె­న్సీ గ్రా­మా­ల్లో డోలీ మో­త­ల­తో ప్ర­జ­లు ఇబ్బం­ది పడు­తు­న్నా­ర­ని సీఎం చం­ద్ర­బా­బు­కి చె­బి­తే.. రూ.1000 కో­ట్లు కే­టా­యిం­చ­డం ద్వా­రా.. రో­డ్ల ని­ర్మా­ణం జరు­గు­తోం­ద­ని పవన్ కళ్యా­ణ్ తె­లి­పా­రు. ఈ రో­డ్లు టూ­రి­జం­తో­పా­టూ.. యు­వ­త­కు ఉపా­ధి కల్పి­స్తు­న్నా­న్న ఆయన… అటవీ అను­మ­తు­ల­తో ప్ర­తీ­దీ పక్కా­గా ప్లా­న్స్ చే­స్తు్న్నా­మ­ని తె­లి­పా­రు. ప్ర­ధా­ని మోదీ దృ­ష్టి, ని­తి­న్ గడ్క­రీ కృషి, చం­ద్ర­బా­బు సం­క­ల్పం­తో రా­ష్ట్రం అభి­వృ­ద్ధి­లో పరు­గు­లు పె­డు­తోం­ది అన్నా­రు. అన్ని ప్రాం­తా­లూ అభి­వృ­ద్ధి చెం­దా­ల­నే­దే లక్ష్య­మ­న్న పవన్ కళ్యా­ణ్… గడ్క­రీ­ని హైవే మ్యా­న్ ఆఫ్ ఇం­డి­యా­ని ప్ర­శం­సిం­చా­రు. గడ్కరీ ప్రారంభించిన రహదారులు మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండ్లెం జాతీయ రహదారులు. ఇవి రూ.5,233 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో భాగంగా విస్తరణ పూర్తి చేసుకున్నాయి. ఈ రహదారులతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటూ.. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అంచనా. . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కలిసే సాగుతాం

కూ­ట­మి­లో ఉన్న మూడు పా­ర్టీ­ల్లో­ని నే­త­లు, కా­ర్య­క­ర్త­ల­కు చి­న్న­చి­న్న పొ­ర­ప­చ్చా­లు ఉన్నా.. మీ స్ధా­యి­లో­నే పరి­ష్క­రిం­చు­కొ­ని ముం­దు­కె­ళ్లా­ల­ని పవన్ కల్యా­ణ్ సూ­చిం­చా­రు. మన కూ­ట­మి ఐక్య­త­ను దె­బ్బ­తీ­య­డా­ని­కి వై­సీ­పీ నే­త­లు ఎంతో ప్ర­య­త్నం చే­స్తా­ర­ని.. మనం జా­గ్ర­త్త­గా ఉం­డా­ల­ని హె­చ్చ­రిం­చా­రు. అభి­వృ­ద్ధి­లో వె­ను­క­బ­డ్డ ఆం­ధ్ర­ప్ర­దే­శ్ తి­రి­గి ముం­దు­కు వె­ళ్లే ప్ర­య­త్నం చే­యా­ల­ని ఆకాం­క్షిం­చా­రు. కనీ­సం 15 సం­వ­త్స­రా­లు ఈ కూ­ట­మి చాలా బలం­గా ఉం­డా­ల­ని ఉద్ఘా­టిం­చా­రు. తమ ఈ ప్ర­య­త్నం వల్లే ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­లు వస్తు­న్నా­య­ని నొ­క్కి­చె­ప్పా­రు. ఈరో­జు రో­డ్లు వే­య­డ­మే కా­ద­ని.. ఇది భారత భవి­ష్య­త్తు­కు బల­మైన పు­నా­ద­ని పవన్ కల్యా­ణ్ అభి­వ­ర్ణిం­చా­రు. ఈ దేశ ప్ర­గ­తి­కి చి­హ్నా­లు రవా­ణా మా­ర్గా­ల­ని నొ­క్కి­చె­ప్పా­రు. గో­ల్డె­న్ క్వా­ర్డ­లే­ట­ర్ ద్వా­రా రహ­దా­రు­లు దేశ దశ­ది­శ­ను ది­వం­గత మాజీ ప్ర­ధా­న­మం­త్రి అటల్ బి­హా­రీ వా­జ్‌­పా­యి మా­ర్చా­ర­ని కొ­ని­యా­డా­రు. గత జగన్ ప్ర­భు­త్వా­ని­కి కేం­ద్ర­ప్ర­భు­త్వం నుం­చి సహ­కా­రం వచ్చి­నా సరైన వి­ధం­గా స్పం­దిం­చ­లే­ద­ని పవన్ కల్యా­ణ్ మం­డి­ప­డ్డా­రు. జగన్ పాలన ఓ విధ్వంసమని అన్నారు.

Tags:    

Similar News