కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా పర్యటించనున్నారు. కాకినాడ పోర్టులో ల్యాండ్ కానున్న పవన్ కళ్యాణ్.. కాకినాడ పోర్టుతోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. మళ్లీ తెరపైకి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు వ్యవహారం రావడంతో పవన్ కల్యాణ్ తనిఖీకి ప్రాధాన్యం ఏర్పిడింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లి ఓడలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తనిఖీ నిర్వహించారు. రాజమండ్రి లో ల్యాండ్ అయి అక్కడినుంచి రోడ్డుమార్గంలో కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగు పెడుతున్నారు.