Prakasam: బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. మద్యం కోసం ఎగబడిన జనం..
Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద నేషనల్ హైవేపై బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తాపడింది.
Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద నేషనల్ హైవేపై బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. శ్రీకాకుళం జిల్లా రుణస్థలం నుంచి మదనపల్లికి 12వందలకు పైగా కేసుల లోడుతో వెళ్తున్న లారీ.. డివైడర్ దిమ్మెను ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. బీరు సీసాలు రోడ్డు పాలుకావటంతో.. వీటికోసం స్థానికులు ఎగబడ్డారు. బీరు బాటిళ్లను ఎత్తుకెళ్తున్న జనాలను లారీ డ్రైవర్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన సాధ్యంకాలేదు.