POOJAS: తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతశోభ

Update: 2025-08-08 11:21 GMT

శ్రా­వణ శు­క్ర­వా­రా­న్ని పు­ర­స్క­రిం­చు­కు­ని తె­లు­గు రా­ష్ట్రాల ఆడ­ప­డు­చు­లు వై­భ­వం­గా వర­ల­క్ష్మీ వ్ర­తా­లు చే­సు­కుం­రు. తె­లు­గు రా­ష్ట్రా­ల్లో ఎక్కడ చూ­సి­నా ఆధ్యా­త్మిక శోభ సం­త­రిం­చు­కుం­ది. పలు ఆల­యా­ల్లో అమ్మ­వా­ర్ల­ను కరె­న్సీ నో­ట్లు, పూ­ల­తో వి­శే­షం­గా అలం­క­రిం­చా­రు. భక్తు­లు పె­ద్ద సం­ఖ్య­లో సా­మూ­హిక వ్ర­తా­లు, కుం­కు­మా­ర్చ­న­లు ని­ర్వ­హిం­చా­రు.

ఇస్తినమ్మా వాయనం

వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువలకు ఇచ్చే వాయనం చాలా ముఖ్యమైనది. ఇంటికి పిలిచిన ముత్తైదువులను కుంకుమ బొట్టు పెట్టి, పాదాలకు పసుపు రాయాలి. వాయనంలో జాకెట్ ముక్క పెట్టి రెండు తమలపాకులో పసుపు, కుంకుమ, 2 వక్కలు, గాజులు, రెండు పండ్లు, పూలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, నానబెట్టిన శనగలు పెట్టి ఇవ్వాలి. వీటిని ముత్తైదువుకు అందిస్తూ ఇస్తినమ్మా వాయనం అంటే.. వారు పుచ్చికుంటినమ్మా వాయనం అంటారు.

Tags:    

Similar News