RAMMOHAN NAIDU: వచ్చే ఏడాది నుంచే విమాన వైభోగం

2026 నుంచే భోగాపురం నుంచి విమానాలు..వర్షాలు కురుస్తున్న ముమ్మరంగా పనులు...86 శాతం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి.

Update: 2025-09-14 07:00 GMT

వి­జ­య­న­గ­రం జి­ల్లా భో­గా­పు­రం­లో ని­ర్మిం­చ­త­ల­పె­ట్టిన గ్రీ­న్‌­ఫీ­ల్డ్‌ వి­మా­నా­శ్ర­యం పను­లు యు­ద్ధ­ప్రా­తి­ప­ది­కన కొ­న­సా­గు­తు­న్నా­యి. ని­ర్ణీత లక్ష్యా­ని­కం­టే ముం­దు­గా­నే పను­లు పూ­ర్తి­చే­సే ది­శ­గా పౌర వి­మా­న­యా­న­శాఖ మం­త్రి కిం­జ­రా­పు రా­మ్మో­హ­న్‌ నా­యు­డు పను­ల­ను పరు­గు­లు పె­ట్టి­స్తు­న్నా­రు. పనుల పు­రో­గ­తి­పై సీఎం చం­ద్ర­బా­బు ఎప్ప­టి­క­ప్పు­డు పర్య­వే­క్షి­స్తు­న్నా­రు. ఈ వి­మా­నా­శ్రయ ని­ర్మా­ణం­లో మొ­త్తం 5,050 మంది కా­ర్మి­కు­లు, సి­బ్బం­ది, ఇం­జ­నీ­ర్లు ని­మ­గ్న­మ­య్యా­రు. వచ్చే ఏడా­ది జూ­న్‌­నా­టి­కి వి­మా­నా­శ్ర­యా­న్ని పూ­ర్తి స్థా­యి­లో అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­రా­వా­ల­నే­ది లక్ష్యం.

పనులు పరిశీలించిన మంత్రి

భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్టు నుం­చి వి­మాన సర్వీ­సు­లు 2026 జూ­న్‌­లో ప్రా­రం­భ­మ­వు­తా­య­ని పౌర వి­మా­న­యాన శాఖ మం­త్రి రా­మ్మో­హ­న్‌­నా­యు­డు అన్నా­రు. వి­మా­నా­శ్రయ ని­ర్మాణ పను­ల­ను శని­వా­రం ఆయన పరి­శీ­లిం­చా­రు. పనుల పు­రో­గ­తి, పూ­ర్తి­కా­వా­ల్సిన ని­ర్మా­ణా­లు, తది­తర అం­శా­ల­పై ని­ర్మాణ సం­స్థ అధి­కా­రు­ల­తో సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. అనం­త­రం మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ.. ఎన్ని సవా­ళ్లు ఎదు­రై­నా జీ­ఎం­ఆ­ర్‌ సం­స్థ పను­లు ఆపడం లే­ద­న్నా­రు. ఓ వైపు వర్షా­లు కు­రు­స్తు­న్నా ఎయి­ర్‌­పో­ర్టు ని­ర్మాణ పను­లు మా­త్రం కొ­న­సా­గు­తు­న్నా­య­ని చె­ప్పా­రు. ఇప్ప­టి వరకు 86 శాతం ఎయి­ర్‌­పో­ర్టు ని­ర్మా­ణం పూ­ర్త­యిం­ద­ని చె­ప్పా­రు. వి­శాఖ నుం­చి రో­డ్డు కనె­క్టి­వి­టీ­కి సం­బం­ధిం­చి అనేక సా­ర్లు సమీ­క్ష­లు ని­ర్వ­హిం­చా­మ­న్నా­రు. మొ­త్తం 7 పా­యిం­ట్లు గు­ర్తిం­చా­మ­ని చె­ప్పా­రు. 2019, ఫి­బ్ర­వ­రి 14న అప్ప­టి సీఎం చం­ద్ర­బా­బు భో­గా­పు­రం వి­మా­నా­శ్రయ ని­ర్మా­ణా­ని­కి శం­కు­స్థా­పన చే­శా­రు. ప్రా­థ­మిక పను­లు చే­ప­డు­తుం­డ­గా.. రా­ష్ట్రం­లో అధి­కార మా­ర్పి­డి జరి­గి వై­సీ­పీ పగ్గా­లు చే­ప­ట్టిం­ది.

మార్చిలోగా పూర్తి చేస్తాం

‘‘మా­ర్చి, ఏప్రి­ల్‌­లో­గా ఈ రహ­దా­రి పూ­ర్తి చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నాం. శ ఎలి­వే­టె­డ్‌ కా­రి­డా­ర్‌ కూడా ప్ర­తి­పా­ద­న­లో ఉంది. బీ­చ్‌ కా­రి­డా­ర్‌ ని­ర్మా­ణం కోసం కూడా డీ­పీ­ఆ­ర్‌ సి­ద్ధం చే­స్తు­న్నాం. వి­శాఖ నుం­చి కొ­చ్చి­కి కనె­క్టి­వి­టీ కోసం వి­న­తు­లు వచ్చా­యి. వి­శాఖ నుం­చి అం­త­ర్జా­తీయ కనె­క్టి­వి­టీ పెం­చేం­దు­కు దృ­ష్టి సా­రిం­చాం.’’ అని రా­మ్మో­హ­న్‌ నా­యు­డు తె­లి­పా­రు.

జగన్ శంకుస్థాపన చేసినా...

2023, మే 3న ఎయి­ర్‌­పో­ర్టు ని­ర్మా­ణా­ని­కి జగ­న్‌ మరో­సా­రి శం­కు­స్థా­పన చే­సి­నా పను­ల్లో ఆశిం­చిన పు­రో­గ­తి లేదు. కే­వ­లం 15 నుం­చి 18శాతం మా­త్ర­మే పను­లు చే­య­గ­లి­గిం­ది. 2024, జూ­న్‌­లో ఏపీ­లో కూ­ట­మి అధి­కా­రం­లో­కి వచ్చిం­ది. వచ్చాక ఏపీ­లో తొలి ప్రా­ధా­న్య ప్రా­జె­క్టు­గా భో­గా­పు­రం వి­మా­నా­శ్రా­యం పను­ల­ను పరు­గు­లు పె­ట్టిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. వి­మా­నా­శ్ర­యా­ని­కి మన్యం వీ­రు­డు అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు పేరు పె­ట్టా­రు. ఎంపీ రా­మ్మో­హ­న్‌­నా­యు­డు ని­రం­త­రం పర్య­వే­క్షి­స్తూ.. ప్ర­తి 15రో­జు­ల­కు ఒక­సా­రి సం­ద­ర్శిం­చి పు­రో­గ­తి­ని తె­లు­సు­కుం­టు­న్నా­రు. ప్ర­స్తు­తం ఎయి­ర్‌­పో­ర్టు­కు సం­బం­ధిం­చి 2,200 ఎక­రా­ల్లో పను­లు చు­రు­గ్గా జరు­గు­తు­న్నా­యి. రా­ష్ట్ర ప్ర­భు­త్వం తన పరి­ధి­లో­ని 500 ఎక­రా­ల­ను పర్యా­టక, ఇత­ర­త్రా అవ­స­రాల కోసం వి­ని­యో­గిం­చా­ల­ని భా­వి­స్తోం­ది. వి­మా­నా­శ్రయ ని­ర్మాణ పను­లు చే­ప­ట్టిన జీ­ఎం­ఆ­ర్‌ సం­స్థ అధి­నేత గ్రం­ధి మల్లి­కా­ర్జు­న­రా­వు స్వ­స్థ­లం వి­జ­య­న­గ­రం కా­వ­డం­తో మరింత అం­కి­త­భా­వం­తో పను­లు చే­ప­డు­తు­న్నా­రు. ఇప్ప­టి­వ­ర­కు 86 శాతం పను­లు పూ­ర్తి చే­శా­రు.

భో­గా­పు­రం వి­మా­నా­శ్ర­యా­న్ని ఉత్త­రాం­ధ్ర­లో­ని అన్ని జి­ల్లా­ల­కు అను­సం­ధా­నిం­చే­లా పను­లు చే­ప­డు­తు­న్నా­రు. అన­కా­ప­ల్లి, వి­జ­య­న­గ­రం జి­ల్లాల మీ­దు­గా వె­ళ్లే అరకు ప్ర­ధాన రహ­దా­రి, వి­జ­య­న­గ­రం మీ­దు­గా పా­ర్వ­తీ­పు­రం మన్యం జి­ల్లా­కు వె­ళ్లే అన్ని ప్ర­ధాన రహ­దా­రు­ల­ను కలు­పు­తు­న్నా­రు. వీ­టి­తో పాటు ఒడి­శా, ఛత్తీ­స్‌­గ­ఢ్ వె­ళ్లే జా­తీయ రహ­దా­రు­ల­ను సైతం అను­సం­ధా­నం చే­స్తు­న్నా­రు.

Tags:    

Similar News