గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపు.. అశోక్ గజపతిరాజు ఆగ్రహం
తూర్పు గోదావరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఛైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన స్థానంలో సంచయితను నియమించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ ఆర్డర్ అర్థరాత్రి జీవోలకు నిదర్శనమని విమర్శించారు. దేవదాయ భూముల లూటీకి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాన్సాస్ వైభవం కనుమరుగయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్ గజపతిరాజు విమర్శించారు.