AP: రాజమండ్రిలో బోల్తా పడ్డ బస్సు

Update: 2025-01-23 03:15 GMT

ఏపీలోని రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 50 మందితో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు దివాన్‌ చెరువు (Diwan Cheruvu) హైవేపై అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కోమలి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

కాకినాడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

కాకినాడ జిల్లా తాళ్లరేవు పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, బైకు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో కాకినాడ GGHకి తరలించారు. బైక్ ని ఢీ కొట్టిన బొలెరో వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News