మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని.. అలాంటి వారికి మరో అవకాశం ఇస్తామని అన్నారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు.