Andhra Pradesh : ఏపీలో యూట్యూబర్ అనుమానాస్పద మృతి

Update: 2025-02-19 07:45 GMT

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నివాసముంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహణతో పాటు, పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భోగాల తిరుమల రెడ్డి సోమవారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఆయన రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. అయితే అందరూ అనుమాన పడ్డట్టుగానే మంగళవారం మధ్యాహ్నం సంఘటన స్థలం నుండి కిలోమీటరు దూరంలో గుంతకల్లు - పత్తికొండ రహదారులోని కసాపురం వద్ద నున్న హంద్రీ-నీవా కాలువలో తిరుమలరెడ్డి (46) శవమై తేలాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం తిరుమలరెడ్డిని హత్య చేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహంపై గాయాలు ఉండడంతో చంపి కాలువలో పడేసినట్లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ ని వివరణ కోరగా, తమ విచారణలో ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉందని, వారిని తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు తిరుమలరెడ్డికి భార్య, కూతురు ఉన్నారు.

Tags:    

Similar News