జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!
త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది.;
ఏపీలో ప్రాదేశిక ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. గత ఏడాది మధ్యలో ఆగిన ప్రక్రియను కొనసాగించాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ.. ఈ మేరకు కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీని కలిసి.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. గతంలో నిమ్మగడ్డ ఉన్నప్పుడే అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని.. రానున్న ఎన్నికలు కూడా ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ విమర్శిస్తోంది.