స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీకి భంగపాటు తప్పదు : బోండా ఉమా

Update: 2020-10-23 08:56 GMT

ఏపీలో వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెడుతోంది. ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానుంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అధికార వైసీపీకి భంగపాటు తప్పదన్నారు బోండా ఉమ. 

Tags:    

Similar News