Allagadda: ప్రత్యర్థుల దాడి లో ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ భాస్కర్రెడ్డి భార్య మృతి
ఆళ్లగడ్డలో హైటెన్షన్..;
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు భాస్కర్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది.
అయితే మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో ఆళ్లగడ్డ ఉలిక్కి పడింది. ఎమ్మెల్యే సన్నిహితురాలిపై దాడి చేసి హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇటీవల జరగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు మద్దతుగా భాస్కర్ రెడ్డి దంపతులు ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా ఇతరత్రా కారణాలు ఏవైనా హత్యకు కారణమా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.