జగనన్న విద్యాకానుకపై టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శలు

Update: 2020-10-08 12:48 GMT

జగనన్న విద్యాకానుకపై టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శలు చేశారు. విద్యా కానుక పథకంలో కొత్తదనం ఏముందని అన్నారు. కరోనా పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రచారం కోసం పసిపిల్లల ఆరోగ్యం ఏమైనా ఫర్వాలేదా అని మండిపడ్డారు. ప్రభుత్వం జీవో నెం.3ని వెంటనే ఉపసంహరించుకోవాలి సంధ్యారాణి డిమాండ్ చేశారు.


Tags:    

Similar News