TESLA: అమరావతికి టెస్లా కంపెనీ..?

రంగంలోకి దిగిన చంద్రబాబు సర్కార్‌... అమరావతిలో 1000 ఎకరాల భూ కేటాయింపు;

Update: 2025-06-09 05:30 GMT

నవ్యాంధ్రలో నవ శకం ఆరంభమైంది. ఆరు కోట్ల ఆంధ్రుల కలలు ఒక్కొక్కటిగా సాకారమవుతున్నాయి. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతే... నేడు ఆంధ్రుల ఆధునిక రాజధాని నగరంగా రూపొదిద్దుకుంటోంది.శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునర్జీవం దిశగా పనులకు అడుగులు పడిన వేళ... దిగ్గజ కంపెనీలు అమరావతికి క్యూ కడుతున్నాయి. గూగుల్‌ సహా దిగ్గజ కంపెనీలు అమరావతికి క్యూ కట్టాయి. తాజాగా మస్క్ కంపెనీ టెస్లా కూడా ఏపీకి వచ్చేందుకు సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి.

ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం

అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల కంపెనీ టెస్లా తయారీ యూనిట్‌ను ఏపీకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం రేసులోకి దిగింది. ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పడానికి ఆ కంపెనీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ ఈవీ కార్ల తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ ఏపీలోని దక్షిణ ప్రాంతంలో పోర్టు కనెక్టివిటీతో ల్యాండ్‌ బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పకపోయినా.. పోర్ట్‌ యాక్సె్‌సతో టెస్లా రెడీమేడ్‌ కార్లను దిగుమతి చేసుకోవడానికి వీలుగా భూమితో పాటు ఆకర్షణీయ ప్రోత్సాహకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్‌ చేస్తోంది.

తీవ్ర కృషి చేస్తున్న చంద్రబాబు

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఎలెన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీని సైతం రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తనకున్న పరిచయాలతో టెస్లా కంపెనీని రాష్ట్రంలో పెట్టించాలనే దిశగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మస్క్ దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలుస్తోంది. రాష్ట్రంలో టెస్లా కార్ల కంపెనీ పెడితే అమరావతి లేదా నెల్లూరు జిల్లాలో 1000 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు కూడా పంపినట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో గూగుల్ కంపెనీ 143 ఎకరాల భూమి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తు ప్రకార ఉత్తరాన వెంకటేశ్వరుడు ఆలయం, తూర్పున దేవేంద్ర పిరమిడ్, పడమర కొండలు, దక్షిణాన ఖాళీ భూమి ఉన్నాయని, దీన్ని బట్టి గూగుల్ సంస్థకు భూమిని కేటాయిస్తున్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఆయా పరిసరాల్లోనే నిర్మించనున్నట్టు తెలిస్తోంది.

Tags:    

Similar News