TIRUMALA: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ కథలన్నీ కల్పనలే

తెరపైకి తిరుమల శ్రీవారి పింక్ డైమండ్... శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని కలకలం... అసలు పింక్ డైమండే లేదన్న ఏఎస్ఐ... పింక్ డైమండ్ కాదు కెంపు అన్న మునిరత్నం

Update: 2025-09-12 03:30 GMT

తి­రు­మల శ్రీ­వా­రి­కి మై­సూ­రు మహా­రా­జు బహూ­క­రిం­చిం­ది పిం­క్‌ డై­మం­డ్‌ కా­ద­ని, అది కే­వ­లం కెం­పు మా­త్ర­మే­న­ని ఆర్కి­యా­ల­జి­క­ల్‌ సర్వే ఆఫ్‌ ఇం­డి­యా (ఏఎ­స్ఐ) స్ప­ష్టం చే­సిం­ది. తి­రు­మల ఆల­యం­లో­ని అత్యంత వి­లు­వైన పిం­క్‌ డై­మం­డ్‌­ను మాయం చే­శా­రం­టూ 2018లో ప్ర­ధాన అర్చ­కు­డు రమ­ణ­దీ­క్షి­తు­లు చే­సిన ఆరో­ప­ణ­లు దే­శ­వ్యా­ప్తం­గా సం­చ­ల­నం సృ­ష్టిం­చా­యి. ఈ అం­శం­పై ఏఎ­స్ఐ లో­తు­గా అధ్య­య­నం చే­సిం­ది. మై­సూ­ర్‌­లో­ని ఏఎ­స్ఐ డై­రె­క్ట­ర్‌(ఎపి­గ్ర­ఫీ) ము­ని­ర­త్నం రె­డ్డి ఆ వి­వ­రా­ల­ను వె­ల్ల­డిం­చా­రు. తాము సే­క­రిం­చిన సమా­చా­రం ప్ర­కా­రం అది పిం­క్‌ డై­మం­డ్‌ కా­నే­కా­ద­ని ప్ర­క­టిం­చా­రు. 1945 జన­వ­రి 9న మై­సూ­రు మహా­రా­జు జయ­చా­మ­రా­జేం­ద్ర వడి­యా­ర్‌ శ్రీ­వా­రి దర్శ­నం కోసం తి­రు­మల వచ్చా­ర­ని, తాను బా­ల్యం­లో ధరిం­చిన హా­రా­న్ని స్వా­మి­కి సమ­ర్పిం­చా­ర­ని వి­వ­రిం­చా­రు. మై­సూ­రు ప్యా­లె­స్‌ రి­కా­ర్డుల ప్ర­కా­రం అం­దు­లో కెం­పు­లు, మరి­కొ­న్ని రకాల రత్నా­లు మా­త్ర­మే ఉన్నా­య­ని, పిం­క్‌ డై­మం­డ్‌ ప్ర­స్తా­వన అం­దు­లో లే­ద­ని ము­ని­ర­త్నం రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. తి­రు­మల ఆల­యం­లో­ని అత్యంత వి­లు­వైన పిం­క్‌ డై­మం­డ్‌­ను మాయం చే­శా­ర­ని.. 2018లో అప్ప­టి ప్ర­ధాన అర్చ­కు­డు రమ­ణ­దీ­క్షి­తు­లు చే­సిన ఆరో­ప­ణ­లు దే­శ­వ్యా­ప్తం­గా సం­చ­ల­నం సృ­ష్టిం­చా­యి.

ఇదీ నేపథ్యం

మహా­రాజ పర్య­ట­న­కు సం­బం­ధిం­చి మై­సూ­రు ప్యా­లె­స్‌ నుం­చి 1944 డి­సెం­బ­రు 29వ తే­దీన రా­మ­య్య అనే ప్యా­లె­స్‌ అధి­కా­రి టీ­టీ­డీ కమి­ష­న­ర్‌­కు లేఖ రా­శా­రు. రైలు ద్వా­రా 1945 జన­వ­రి 9న ఉదయం 8 గం­ట­ల­కు రే­ణి­గుం­ట­కు చే­రు­కు­న్న తరు­వాత .. మహా­రా­జు తి­రు­ప­తి, శ్రీ­కా­ళ­హ­స్తి రా­క­పో­క­ల­కు రెం­డు మంచి కా­ర్ల­ను ఏర్పా­టు చే­సేం­దు­కు సహ­క­రిం­చా­లం­టూ ఆ లే­ఖ­లో కో­రా­రు. ఈ సం­ద­ర్భం­లో­నే టూ­ర్‌ షె­డ్యూ­ల్‌ కా­పీ­ని కూడా పం­పా­రు.ఈ పర్య­ట­న­లో­నే మై­సూ­రు మహా­రా­జు శ్రీ­వా­రి­కి హా­రా­న్ని సమ­ర్పిం­చా­రు.ఆ హా­రా­న్ని టీ­టీ­డీ కొ­న్నే­ళ్లు­గా వి­శేష ఉత్స­వాల సమ­యం­లో ఉత్స­వ­మూ­ర్తు­ల­కు అలం­క­రి­స్తోం­ది. 2001 అక్టో­బ­రు 21న జరి­గిన గరు­డ­సే­వ­లో శ్రీ మల­య­ప్ప­స్వా­మి­కి ఈ హా­రా­న్ని అలం­క­రిం­చా­రు. వా­హ­న­సే­వ­ను వీ­క్షి­స్తు­న్న భక్తు­లు వి­సి­రిన నా­ణే­లు తగ­ల­డం­తో ఆభ­ర­ణం­లో కెం­పు రాయి వి­రి­గి­పో­యిం­ది. ఆ వి­ష­యా­న్ని తి­రు­వా­భ­ర­ణం రి­జి­స్ట­ర్‌­లో కూడా నమో­దు చే­శా­రు. మై­సూ­రు మహా­రా­జు శ్రీ­వా­రి­కి సమ­ర్పిం­చిన హా­రం­లో ఉన్న­ది కెం­పు రాయి కా­ద­ని... కో­ట్ల వి­లు­వైన పిం­క్‌ డై­మం­డ్‌ అని... ఆ డై­మం­డ్‌­ను అప­హ­రిం­చి జె­నీ­వా­లో జరి­గిన వే­లం­లో వి­క్ర­యిం­చా­రని రమణ దీ­క్షి­తు­లు ఆరో­పిం­చా­రు.

Tags:    

Similar News