tirumala: 27 ఏళ్లుగా తిరుమల శ్రీవారి సేవలో...

రూపాయి తీసుకోకుండా సేవ చేస్తున్న భక్తుడు;

Update: 2025-07-15 03:00 GMT

కో­ట్లా­ది‌ మంది ఆరా­ధ్య దై­వ­మైన శ్రీ­ని­వా­సు­డి­కి భక్తుల వి­ష­యం­లో ఎలాం­టి కొదవ లేదు. శ్రీ­వా­రి సే­వ­లో మహా­రా­జుల నుం­చి కటిక ని­రు­పేద వరకూ తరిం­చిన వారే. క్ష­ణ­కా­లం పాటు జరి­గే శ్రీ­ని­వా­సు­డి దర్శన భా­గ్యం కోసం కో­ట్లా­ది మంది భక్తు­లు పరి­త­పిం­చి పో­తుం­టా­రు.. భక్తుల పా­లిట కొం­గు బం­గా­రం­మైన శ్రీ వేం­క­టే­శ్వ­రు­డి సన్ని­ధి­లో గడ­పా­ల­ని, ఆయన సేవ చే­యా­ల­ని భక్తు­లు ఎం­త­గా­నో తపిం­చి పో­తా­రు. కొం­ద­రు శ్రీ­ని­వా­సు­డి­కి కో­ట్ల రూ­పా­య­లు కా­ను­క­లు­గా సమ­ర్పి­స్తే, మరి కొం­ద­రు ఆభ­ర­ణాల రూ­పం­లో, భూ­ముల రూ­పం­లో స్వా­మి వా­రి­కి కా­ను­క­లు­గా సమ­ర్పిం­చ­డం చూ­స్తూ­నే ఉన్నాం. ఇలా ఒక్కొ­క్క­రు ఒక్క­లా సే­వ­లో చే­స్తుం­టే తి­రు­ప­తి­కి చెం­దిన ఒక వ్య­క్తి మా­త్రం స్వా­మి వా­రి­పై అపా­ర­మైన భక్తి భా­వం­తో దా­దా­పు 27 ఏళ్ళు­గా పర­దా­ల­ను కా­ను­క­గా సమ­ర్పిం­చి శ్రీ వేం­క­టే­శ్వ­రు­డి సే­వ­కు అం­కి­తం అయ్యా­రు. ఆయనే పర­దాల మణి. ఏటా నా­లు­గు­సా­ర్లు ప్ర­త్యేక రో­జు­ల్లో పర­దా­లు ఇవ్వ­డం పర­దాల మణి ఆన­వా­యి­తీ. కో­యి­ల్ ఆళ్వా­ర్ తి­రు­మం­జ­నం సం­ద­ర్భం­గా మణి కా­లి­న­డ­కన తి­రు­మ­ల­కు చే­రు­కు­ని దే­వ­స్థా­నం అధి­కా­రు­ల­కు పర­దా­లు అం­ద­జే­స్తా­రు. ఆయన తయా­రు­చే­సిన పర­దా­లు గర్భా­ల­యం, రా­ము­ల­వా­రి మే­డ­లో అలం­క­రి­స్తా­రు. టై­ల­ర్‌­గా జీ­వి­తం ప్రా­రం­భిం­చిన మణి, శ్రీ­ని­వా­సు­డి పి­లు­పు­తో ఈ సే­వ­కు అం­కి­త­మ­య్యా­రు.

పరమ భక్తుడు

ఎన్నో ఏళ్లుగా వెంకన్న స్వామి సేవలో తరిస్తున్నారు పరదాల మణి. 27 ఏళ్లుగా శ్రీవారికి పరదాలు ఇస్తున్నారు. ఈ నెల 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. దీని కోసం పర­దాల మణి సో­మ­వా­రం తి­రు­మ­ల­కు కా­లి­న­డ­కన చే­రు­కు­న్నా­రు. ఆయన దే­వ­స్థా­నం అధి­కా­రు­ల­కు పర­దా­లు, కు­రా­ళా­లు అం­దిం­చా­రు. ఈ సారి కూడా మణి ప్ర­త్యే­కం­గా శ్రీ­వా­రి నే­త్ర దర్శ­నం పర­దా­ల­ను తయా­రు చే­శా­రు. అం­తే­కా­కుం­డా సి­రు­లు కు­రి­పిం­చే శ్రీ­మ­హా­ల­క్ష్మి, శంకు, చక్రా­లు, పూ­ర్ణ­కుం­భం, గజ వా­హ­నం­పై తి­రు­నా­మం, తామర పు­ష్పం వంటి డి­జై­న్ల­తో పర­దా­ల­ను రూ­పొం­దిం­చా­రు మణి. తి­రు­మల శ్రీ­వా­రి­కి పరమ భక్తు­డు, టై­ల­ర్‌­గా జీ­వి­తం ప్రా­రం­భిం­చి, వృ­త్తి­నే ఇంటి పే­రు­గా మా­ర్చు­కు­న్నా­రు మణి. ఆయన శ్రీ­ని­వా­సు­డి పి­లు­పు­తో వై­కుం­ఠ­నా­ధు­డి­కి పర­దా­లు సమ­ర్పిం­చే భా­గ్యం పొం­దా­డు. 1999లో శ్రీ పద్మా­వ­తి అమ్మ­వా­రి ఆల­యం­లో హుం­డీ ఏర్పా­టు చేసే అవ­కా­శం వచ్చిం­ది. మొ­ద­టి­సా­రి­గా ఆయన బట్ట­ల­తో హుం­డీ­ని తయా­రు చే­శా­డు. దీం­తో ఆలయ అధి­కా­రుల మన్న­న­లు పొం­దా­డు. ప్ర­ద­క్షి­ణ­లు చే­స్తూ స్వా­మి సే­వ­లో తరిం­చే అవ­కా­శం ఇవ్వ­మ­ని కో­రు­కు­నే­వా­డు. 27 ఏళ్లు­గా మణి శ్రీ­వా­రి ఆల­యా­ని­కి పర­దా­లు అం­ది­స్తు­న్నా­రు.

Tags:    

Similar News