ఏపీలో పలు ప్రైవేట్ ట్రావెల్స్ పై అధికారుల కొరడా!

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద పలు ప్రైవేట్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు.

Update: 2021-01-13 10:08 GMT

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద పలు ప్రైవేట్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మొత్తం 106 బస్సులపై కేసులు నమోదయ్యాయి. సుమారు 3 లక్షల వరకు జరిమానా విధించారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీకి ప్రజలు వెళ్తున్నారు. దీంతో అధికంగా ప్రయాణికులను ఎక్కించి, పాసింజర్ లిస్ట్ ఇవ్వకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించని బస్సులపై కేసులు బుక్ చేశారు. జిల్లా అధికారుల సూచన మేరకు కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News